ఇంటి కోడలు తెలియక చేసిన చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను బలితీసుకోగా.. మరో ఇద్దరు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తమిళనాడులోని రాణిపేట జిల్లా ఎస్ఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన రైతు పెరియస్వామి(65)కి భార్య లక్ష్మి(57), కుమారుడు శివకుమార్ (27) ఉన్నారు. ఇటీవలే శివకుమార్కు భారతి(22) అనే యువతితో వివాహమైంది. మంగళవారం రాత్రి మైసూరు బోండాలు వేసేందుకు పెరియస్వామి మైదాపిండి తీసుకొచ్చాడు. దీంతో పాటు మరుసటి రోజు పొలంలో పిచికారీ చేసేందుకు పురుగుల మందు తెచ్చి ఇంట్లో ఉంచారు.
Also Read: కన్నకూతురిపైనే కామం.. గర్భం దాల్చడంతో కొత్త నాటకం.. డీఎన్ఏ టెస్ట్తో గుట్టురట్టు
వాటిని చూసిన భారతి నిర్లక్ష్యంగా మైదాపిండిలో ఆ పురుగుల మందు కలిపి బోండాలు వేసింది. వాటిని తిన్న కాసేపటికే నలుగురు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని స్థానికులు వారిని షోలింగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు భారతి, శివకుమార్ చనిపోయారు. పెరియస్వామి, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై అరక్కోణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లయి ఏడాది తిరగకముందే శివకుమార్, భారతి దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: ఇంటర్ స్టూడెంట్తో ఆంటీ అఫైర్... బండారం బయటపడటంతో చివరికి
Also Read: కన్నకూతురిపైనే కామం.. గర్భం దాల్చడంతో కొత్త నాటకం.. డీఎన్ఏ టెస్ట్తో గుట్టురట్టు
వాటిని చూసిన భారతి నిర్లక్ష్యంగా మైదాపిండిలో ఆ పురుగుల మందు కలిపి బోండాలు వేసింది. వాటిని తిన్న కాసేపటికే నలుగురు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని స్థానికులు వారిని షోలింగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు భారతి, శివకుమార్ చనిపోయారు. పెరియస్వామి, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై అరక్కోణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లయి ఏడాది తిరగకముందే శివకుమార్, భారతి దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: ఇంటర్ స్టూడెంట్తో ఆంటీ అఫైర్... బండారం బయటపడటంతో చివరికి