తనతో ప్రేమ వ్యవహారం నడిపిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ట్రాన్స్జెండర్ ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చెన్నై, అన్నానగర్లోని ఈరోడ్ సమీపంలో మూలప్పాలైయమ్ వినాయకుడి ఆలయ వీధికి చెందిన మురుగేషన్ లింగమార్పిడి చేసుకుని సుస్మిత (22)గా మారింది. ఈ నేపథ్యంలో ఈరోడ్ వీరప్పన్ చత్రమ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో సుస్మితకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో కొన్నాళ్లుగా కలిసి తిరుగుతున్నారు. ఈ క్రమంలో సుస్మిత యువకుడి వద్ద పెళ్లి ప్రస్తావ తీసుకొచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించింది.
Also Read: కొడుకుగా పారిపోయి.. ట్రాన్స్జెండర్గా భర్తతో ఇంటికొచ్చింది.. చివరకు?
అయితే ఆ యువకుడు సుస్మితను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. అలాగే ఇకపై తనతో కలిసేది లేదని చెప్పాడు. దీంత మనస్తాపం చెందిన సుస్మిత కొన్ని రోజులుగా ఒంటరిగా కుమిలిపోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని సుస్మిత ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత ఇంటికి వచ్చిన సుస్మిత తల్లి చిన్నపొన్ను స్థానికుల సహాయంతో కిందకు దించి.. చికిత్స కోసం ఈ రోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే సుస్మిత మృతి చెందినట్లు చెప్పారు.
Also Read: హైదరాబాద్లో ‘శ్మశాన’ నిశ్శబ్దం.. ఉరిని ముద్దాడిన ఆరుగురు
Also Read: కొడుకుగా పారిపోయి.. ట్రాన్స్జెండర్గా భర్తతో ఇంటికొచ్చింది.. చివరకు?
అయితే ఆ యువకుడు సుస్మితను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. అలాగే ఇకపై తనతో కలిసేది లేదని చెప్పాడు. దీంత మనస్తాపం చెందిన సుస్మిత కొన్ని రోజులుగా ఒంటరిగా కుమిలిపోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని సుస్మిత ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత ఇంటికి వచ్చిన సుస్మిత తల్లి చిన్నపొన్ను స్థానికుల సహాయంతో కిందకు దించి.. చికిత్స కోసం ఈ రోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే సుస్మిత మృతి చెందినట్లు చెప్పారు.
Also Read: హైదరాబాద్లో ‘శ్మశాన’ నిశ్శబ్దం.. ఉరిని ముద్దాడిన ఆరుగురు