యాప్నగరం

తిరుపతిలో తమిళ యువకుడి దారుణహత్య

తమిళనాడుకు చెందిన రమేశ్ మూడేళ్ల క్రితం తిరుపతికి వచ్చాడు. ఆదివారం రాత్రి అతడిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై కొట్టి దారుణంగా చంపేశారు.

Samayam Telugu 12 May 2020, 9:14 am
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. అలిపిరి సమీపంలోని బాలాజీ టూరిస్టు లింకు బస్టాండు వద్ద ఓ యువకుడు హత్యకు గురైనట్లు అలిపిరి ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ సోమవారం తెలిపారు. తమిళనాడు పళ్లిపట్టు సమీపం గాజులకండ్రిగకు చెందిన రమేష్‌(25) మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం తిరుపతికి వచ్చాడు. ఇక్కడే ఉంటూ నిత్యం టూరిస్టు బస్సులు శుభ్రం చేయడం, ప్రైవేటు జీపులకు లోడ్‌ చేయడం చేస్తూ వచ్చే సంపాదనతో జీవిస్తున్నాడు.
Samayam Telugu Image


Also Read: రూ.1200 కోసం ముగ్గురు ఫ్రెండ్స్‌పై హత్యాయత్నం.. హైదరాబాద్‌లో దారుణం

అయితే సోమవారం ఉదయం రమేశ్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కొందరు అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆదివారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలమైన ఆయుధాలతో రమేష్‌ తలపై దాడి చేచి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్‌లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read: ప్రాణం తీసిన టిక్‌టాక్‌ .. వీడియో తీస్తూ ఉరికి వేలాడిన వివాహిత?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.