యాప్నగరం

వేరే పెళ్లి చేసుకుంటుందన్న అక్కసుతో ప్రియురాలిని రేప్ చేసిన మృగాడు

తాను ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి చేయడాన్ని ఇష్టపడకే ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు.

Samayam Telugu 4 Dec 2019, 2:07 pm
తాను ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదన్న అక్కసుతో ఓ యువకుడు కామాంధుడిగా మారాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడాన్ని తట్టుకోలేక కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తమిళనాడులోని పేర్ణాంబట్టు సమీప ప్రాంతానికి చెందిన మదన్‌కుమార్ అనే యువకుడు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన అదే ప్రాంతానికి చెందిన ఒక యువతితో ఏర్పడిన పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది.
Samayam Telugu GettyImages-140471382_2


Also Read: సహనటితో టీవీ నటుడి అక్రమ సంబంధం.. భార్య ఫిర్యాదుతో జైలుకి

అయితే ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెకు యువకుడితో వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తనతో వచ్చేయాలని ప్రియురాలిని కోరగా.. తాను రానని చెప్పింది. దీన్ని మనసులో పెట్టుకున్న మదన్.. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ప్లాన్ వేశాడు. నవంబర్ 29న ఆమెను కిడ్నాప్ చేసి ఏపీలోని తిరుపతికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ లాడ్జిలో గది తీసుకుని ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు మేల్‌పట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read: హైదరాబాద్‌లో మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి.. 20 రోజుల క్రితమే ప్రేమపెళ్లి

దీంతో విచారణ చేపట్టిన పోలీసుల మదన్‌కుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పేర్ణాంబట్టు బస్టాండ్‌లో అదుపులోకి తీసుకుని యువతిని రక్షించారు. తాను ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి చేయడాన్ని ఇష్టపడకే ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు. దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన పక్కింటి కుర్రాడు.. చివరికి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.