అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. బలవంతంగా నదిలో తోసేసినా బాధితురాలు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది.
Also Read: అత్తింట్లో అల్లుడి హత్య.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య
తమిళనాడులోని తేని జిల్లా చిన్నమనూరు వద్ద ఉన్న ఊత్తుప్పట్టి గ్రామానికి చెందిన రాజా, కవిత దంపతులకు కుమార్తె(17) ఉంది. బోడి పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుకుంటూ హాస్టల్లో ఉంటోంది. ఇటీవల ఆమె బంధువైన ఓ యువకుడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులకు తెలియకుండా అప్పుడప్పుడూ హాస్టల్ నుంచి వెళ్లి ప్రియుడిని కలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన హాస్టల్ నిర్వాహకులు ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు తెలిపారు.
Also Read: వామ్మో.. హైదరాబాద్లో ప్లాస్టిక్ పాలు కూడా అమ్మేస్తున్నారు
దసరా పండుగ సందర్భంగా కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు రాజా ,కవిత గత శుక్రవారం తల్లిదండ్రులు హాస్టల్కు వెళ్లారు. బైక్పై తీసుకెళ్తూ మార్కైయాన్కోట్టై, ములై నది వంతెన వద్ద బైక్ ఆపి ప్రేమ విషయంపై కూతుర్ని నిలదీశారు. ఆమెను తీవ్రంగా కొట్టి వంతెన పైనుంచి నదిలోకి తోసేశారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువతి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఒడ్డుకు చేరుకుంది. తనను రక్షించాలంటూ కేకలు వేయడంతో ఓ వ్యక్తి ఆమెను కాపాడి చిన్నమనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాడు.
Also Read: ఉద్యోగం కోసం వచ్చిన యువతికి మత్తుమందిచ్చి రేప్.. 3నెలల పాటు అదేపని
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని పరామర్శించి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రాజాను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కవిత కోసం గాలిస్తున్నట్ల పోలీసులు తెలిపారు.
Also Read: అక్కలేని సమయం చూసి.. బెడ్రూమ్లో బావతో రాసలీలలు
Also Read: అత్తింట్లో అల్లుడి హత్య.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య
తమిళనాడులోని తేని జిల్లా చిన్నమనూరు వద్ద ఉన్న ఊత్తుప్పట్టి గ్రామానికి చెందిన రాజా, కవిత దంపతులకు కుమార్తె(17) ఉంది. బోడి పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుకుంటూ హాస్టల్లో ఉంటోంది. ఇటీవల ఆమె బంధువైన ఓ యువకుడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులకు తెలియకుండా అప్పుడప్పుడూ హాస్టల్ నుంచి వెళ్లి ప్రియుడిని కలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన హాస్టల్ నిర్వాహకులు ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు తెలిపారు.
Also Read: వామ్మో.. హైదరాబాద్లో ప్లాస్టిక్ పాలు కూడా అమ్మేస్తున్నారు
దసరా పండుగ సందర్భంగా కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు రాజా ,కవిత గత శుక్రవారం తల్లిదండ్రులు హాస్టల్కు వెళ్లారు. బైక్పై తీసుకెళ్తూ మార్కైయాన్కోట్టై, ములై నది వంతెన వద్ద బైక్ ఆపి ప్రేమ విషయంపై కూతుర్ని నిలదీశారు. ఆమెను తీవ్రంగా కొట్టి వంతెన పైనుంచి నదిలోకి తోసేశారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువతి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఒడ్డుకు చేరుకుంది. తనను రక్షించాలంటూ కేకలు వేయడంతో ఓ వ్యక్తి ఆమెను కాపాడి చిన్నమనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాడు.
Also Read: ఉద్యోగం కోసం వచ్చిన యువతికి మత్తుమందిచ్చి రేప్.. 3నెలల పాటు అదేపని
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని పరామర్శించి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రాజాను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కవిత కోసం గాలిస్తున్నట్ల పోలీసులు తెలిపారు.
Also Read: అక్కలేని సమయం చూసి.. బెడ్రూమ్లో బావతో రాసలీలలు