యాప్నగరం

Tamilnadu Tragedy: డ్యామ్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ నలుగురి మృతి

తమిళనాడులోని పాంబార్ డ్యామ్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు వెళ్లిన నలుగురు చనిపోయిన ఘటన ఆదివారం జరిగింది. మృతుల్లో ముగ్గురు యువకులు, ఓ బాలుడు ఉన్నారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Samayam Telugu 7 Oct 2019, 12:39 pm
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణగిరి జిల్లా ఒడ్డపట్టి గ్రామానికి చెందిన సంతోష్‌ (14), స్నేహ (19), వినోద (18), నివేద (20) ఆదివారం ఊత్తంగరై సమీపంలోని పాంబారు జలాశయం అందాలు చూసేందుకు వెళ్లారు.
Samayam Telugu channai


Also Read: అమెరికాలో హైదరాబాద్ మహిళ మృతి.. భర్తే చంపాడంటున్న బంధువులు

నలుగురు కాసేపు అక్కడ ఉత్సాహంగా గడిపి ఫోటోలు తీసుకున్నారు. గట్టుపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో పట్టుతప్పి అంతా నీటిలో పడిపోయారు. ఎవరికీ ఈత రాకపోవడంతో మునిగిపోయారు. వీళ్లను దూరం నుంచి చూసిన స్థానికులు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి వారి కోసం గాలింపు చేపట్టారు. కొద్దిసేపటి మృతదేహాలు పైకి తేలడంతో వెలికితీసి ఒడ్డుకు తెచ్చారు.

Also Read: 9 మంది అమ్మాయిలు.. 19 మంది విటులు.. స్పాలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

ఎంతో ఉత్సాహంగా వచ్చిన తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో మృతుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వారి ఆవేదన చూసిన స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన పండుగ వేళ తీవ్ర విషాదం నింపింది.

Also Read: మామ-కోడలి అక్రమ సంబంధం... ఇద్దరినీ చంపేసిన భర్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.