యాప్నగరం

వ్యభిచారం చేయాలంటూ టిక్‌టాక్ ఫ్రెండ్స్ వేధింపులు.. ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య

భర్త చనిపోయి ముగ్గురు పిల్లలను పోషిస్తున్న మహిళకు టిక్‌టాక్‌లో పరిచయమైన ముగ్గురు మహిళలు వ్యభిచారం చేయాలంటూ వేధించారు. వారి వేధింపులకు మనస్తాపం చెంది ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 29 Jan 2020, 11:22 am
టిక్‌ టాక్‌ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ వ్యభిచారం చేయాలంటూ వేధింపులకు గురిచేయడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా సెంజి సమీపంలోని సత్యమంగళం గ్రామానికి చెందిన కడల్‌కన్ని (39) అనే మహిళ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె ముగ్గురు పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది.
Samayam Telugu suicie


Also read: 13ఏళ్ల బాలికపై పది రోజులుగా అత్యాచారం.. హైదరాబాద్‌లో మరో దారుణం

అప్పుడప్పుడు టిక్‌టాక్‌లో వీడియోలు చేసే ఆమెకు చెన్నైకి చెందిన సుమతి, లత, కవిత ఫ్రెండ్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వ్యభిచారం చేయాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తాను అలాంటి దానినిన కాదని చెప్పినా వినిపించుకోకుండా ఆమె ఇంటికి ఇద్దరు విటులను పంపించారు. దీంతో విసిగిపోయిన కడల్‌కన్ని సత్యమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంటికి ఇద్దరు విటులను పంపి వ్యభిచారం చేయాలని ముగ్గురు ఫ్రెండ్స్ వేధిస్తున్నారని, లేకపోతే తమకు రూ.2లక్షలు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

Also read: రెండో భర్తను బంధించి గోళ్లు పీకేసి.. కిరాతకంగా హత్యచేసిన మహిళా టెక్కీ

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ వైపు దర్యాప్తు చేస్తుండగానే ఆ ముగ్గురి వేధింపులు అధికమయ్యాయి. దీంతో కలత చెందిన కడల్‌కన్ని ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమె కాపాడి సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఆత్మహత్యతో ముగ్గురు బిడ్డలు అనాథలుగా మారారు.

Also read: కోర్టు కస్టడీకి పొళ్లాచ్చి సెక్స్ స్కాండల్‌ కేసు నిందితులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.