యాప్నగరం

మద్యంతో మొదలైన గొడవ.. ‘తిరుమల’ ట్యాక్సీ డ్రైవర్ ఆత్మహత్య

విజయభాస్కర్ తరచూ భార్యతో గొడవపడేవాడు. తాగొచ్చి కొడుతున్నాడని భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఇంటికొచ్చి చూసేసరికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Samayam Telugu 21 Jan 2020, 7:30 pm
మద్యం మహమ్మారి మరో ప్రాణం బలితీసుకుంది. ఇంట్లో మొదలైన చిన్నపాటి గొడవ చివరికి ఆత్మహత్య చేసుకునే వరకూ వెళ్లింది. మందుతాగి ఇంటికొచ్చి గొడవపడుతున్న భర్త వేధింపులు తట్టుకోలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో ఉన్న భర్త మనస్థాపంతో ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
Samayam Telugu suicide


Also Read: కన్నకొడుకు ముందే తల్లిపై అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్స్‌ను కత్తితో దారుణంగా..

జిల్లాలోని పాకాలకు చెందిన విజయభాస్కర్(44)కి కాణిపాకం పరిధిలోని ఐరాల మండలం జంగాలపల్లెకు చెందిన అమృతతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. విజయభాస్కర్ తిరుమలలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వివాహానంతరం కొద్దికాలం పాకాలలో కాపురం పెట్టారు. అక్కడి నుంచి తిరుమలకు మకాం మార్చారు. అనంతరం భార్య స్వగ్రామం జంగాలపల్లె వచ్చి నివాసం ఉంటున్నారు.

Read Also: సెక్స్ బానిసలుగా మారిన జంట.. స్కూల్ డ్రెస్‌ చూస్తే వెర్రి.. చివరికి..

ఈ క్రమంలో మద్యానికి బానిసైన విజయభాస్కర్ తరచూ భార్యతో గొడవపడేవాడు. నిత్యం మందు తాగి వస్తున్న భర్తతో అమృత విసిగిపోయి వాగ్వాదానికి దిగేది. ఇదే విషయమై మరోసారి గొడవ జరగడంతో తాగొచ్చి కొడుతున్నాడని అమృత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపేందుకు ఇంటికి వచ్చే సరికి విజయభాస్కర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోనే దూలానికి చీరతో ఉరివేసుకుని చనిపోయి ఉండడం చూసి అంతా నిశ్చేష్టులయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.