యాప్నగరం

టీడీపీ నేత దారుణ హత్య.. కృష్ణా జిల్లాలో కలకలం

మూడు రోజుల కిందట బందరు నియోజకవర్గ వైసీపీ నేత భాస్కరరావు హత్యకు గురయ్యాడు. ఆ ఘటన మరువక ముందే పక్కనే ఉన్న అవనిగడ్డలో టీడీపీ నేత హత్య అలజడి రేపింది.

Samayam Telugu 1 Jul 2020, 5:20 pm
అధికార వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు భాస్కర్‌రావు హత్యోదంతం మరువక ముందే కృష్ణా జిల్లాలో మరో హత్య కలకలం రేపుతోంది. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలానికి చెందిన టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. పర్రచివర గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీ అభ్యర్థి తాతా సాంబశివరావును గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి కిరాతకంగా చంపేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


నాగాయలంక నుంచి పెద్ద గౌడ పాలెం వైపు వెళ్తుండగా మెరక పాలెం వద్ద కాపు కాసి ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో సాంబశివరావు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాంబశివరావు మృతదేహం వద్ద భోరున విలపించారు.

Also Read:
పెళ్లి కాకుండానే కూతురికి గర్భం.. ఆరా తీస్తే దారుణం వెలుగులోకి..

అవనిగడ్డ సీఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. స్పాట్‌లో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. నిందితుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. రాజకీయ కక్షల కారణంగానే హత్య చేశారా? లేక వ్యక్తిగత గొడవలే కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రశాంతంగా ఉండే తీరప్రాంతంలో వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Read Also: రెండు హత్యలతో కలకలం.. పల్నాడులో హైటెన్షన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.