యాప్నగరం

కడప: కళ్లలో కారంకొట్టి.. టీడీపీ నేత దారుణ హత్య

పేదలకు పట్టాలు ఇచ్చే స్థలాల్లోనే టీడీపీ నేతను అతికిరాతకంగా హతమార్చారు. అధికార వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నాడనే చంపేశారని ఆరోపణలు వస్తున్నాయి.

Samayam Telugu 29 Dec 2020, 12:09 pm
కడప జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని ప్రొద్దుటూరు టీడీపీ నేత సుబ్బయ్యను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా చంపేశారు. కళ్లలో కారంకొట్టి.. మారణాయుధాలతో నరికి దారుణంగా హతమార్చారు. సోములవారిపల్లె సమీపంలోని ఖాళీ స్థలంలో ఈ ఘటన జరిగింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలంలోనే సుబ్బయ్యను అత్యంత దారుణంగా హతమార్చారు. గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడన్న అక్కసుతోనే హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని సుబ్బయ్య మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.
Samayam Telugu హత్యకు గురైన సుబ్బయ్య
murder


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.