యాప్నగరం

అనంతపురంలో టీడీపీ కీలక నేతపై కేసు.. షాకిచ్చిన భార్య

ఇప్పటికే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టయ్యారు. తాజాగా మరో టీడీపీ నేతపై అనంతపురం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

Samayam Telugu 28 Jun 2020, 3:35 pm
జగన్ సర్కార్ ప్రతిపక్ష టీడీపీ నేతలపై కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్న వేళ మరో నేతపై కేసు నమోదైంది. ఇప్పటికే అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. మరోవైపు ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని సైతం కస్టడీలోకి తీసుకున్నారు. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
tdp leader case


తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన మరో టీడీపీ నేతపై కేసు నమోదైంది. చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయుడుకి ఆయన భార్య షాకిచ్చింది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ గృహహింస కేసు పెట్టింది. తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడంటూ ప్రకాష్ నాయుడు భార్య చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం ఫోర్త్‌ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై 498 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: నగ్నంగా ఉరికి వేలాడిన ప్రియురాలు.. పక్కనే ప్రియుడు.. కడపలో కలకలం

ప్రకాష్ నాయుడు టీడీపీలో యాక్టివ్ నేతగా ఉన్నారు. 2004లో ఆయన చంద్రదండును ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన కీలక నామినేటెడ్ పదవి నిర్వహించారు. ఏపీ మాంసం ఉత్పత్తుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన పదవి కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కీలక నేతలపై కేసులు నమోదవుతున్న తరుణంలో కట్టుకున్న భార్యే ఆయనపై కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Read Also: బీటెక్ విద్యార్థినిపై రేప్.. పోర్న్‌సైట్‌లో వీడియోలు.. గుంటూరులో సహ విద్యార్థుల కీచకపర్వం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.