యాప్నగరం

Ongole: కాల్వలో శవమై తేలిన టీచర్.. మిస్టరీగా మరణం?

పాఠశాలకు వెళ్లిన టీచర్ రాత్రి ఇంటికి రాలేదు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు వెతుకుతుండగా కాల్వలో శవమై కనిపించాడు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 22 Oct 2020, 2:13 pm
రోజు మాదిరిగానే స్కూల్‌కి వెళ్లిన టీచర్ ఇంటికి తిరిగిరాలేదు. అద్దంకి బ్రాంచ్ కెనాల్‌లో శవమై కన్పించాడు. ఈ షాకింగ్ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలేనికి చెందిన నంబుల రామాంజనేయులు అదే మండలంలోని వెల్లల చెరువు ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కుటుంబంతో వినుకొండ పట్టణంలో నివాసముంటున్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


ఉదయం స్కూల్‌కి అని చెప్పి వెళ్లిన రామాంజనేయులు రాత్రైనా తిరిగిరాలేదు. కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతుకుతుండగా షాకింగ్ విషయం తెలిసింది. అడవిపాలెం సమీపంలో అద్దంకి బ్రాంచ్ కెనాల్‌లో శవం పైకి తేలడంతో స్థానిక వీఆర్వో పోలీసులకు సమాచారం అందించాడు. ఆయనను రామాంజనేయులుగా గుర్తించారు. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లకుండా అద్దంకి బ్రాంచ్ కెనాల్‌ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. కాల్వలో దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. స్కూల్ నుంచి వచ్చేప్పుడు ఏమైంది అనే విషయం మిస్టరీగా మారింది. ముందుగానే ఆయన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఇలా చేశారా? లేక మరేదైనా జరిగి ఉంటుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీయించి నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: మహబూబాబాద్ దీక్షిత్ మర్డర్: ‘వాడొక్కడే చంపేశాడు’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.