యాప్నగరం

టీచర్ అనుమానాస్పద మృతి.. గుంటూరులో మిస్టరీగా మరణం

ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న ఇందిర ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తింటి వారే చంపేశారని ఆరోపణలు వస్తున్నాయి.

Samayam Telugu 14 Oct 2020, 9:58 am
గుంటూరులో ఓ మహిళా టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన పొన్నూరు మండలం వల్లభరావుపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన ఇందిర(34) పొన్నూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తోంది. ఆమెకు భర్త రవీంద్ర, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనూహ్యంగా ఆమె శవమై తేలింది. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


అత్తింటి వారే చంపేశారని ఆరోపిస్తున్నారు. భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read: రోడ్డుపై పక్కవాడి పొరపాటు ప్రాణం తీసింది.. నెల్లూరులో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.