యాప్నగరం

కర్నూలులో నరబలి.. యువకుడిని నరికి తల, మొండెం వేరుగా!

ఆలయం సమీపంలో యువకుడి హత్య. యువకుడిని నరికి చంపి తల, మొండెం వేరు చేసిన దుండగులు. గుప్త నిధుల కోసం బలి ఇచ్చి ఉంటారని స్థానికుల అనుమానం.

Samayam Telugu 12 Jul 2019, 10:44 pm
ర్నూలు జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం రేపుతోంది. సిరివెళ్ల సమీపంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించింది. యువకుడిని నరికి తల, మొండెం వేరు చేసిన స్థితిలో ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక నరసింహ స్వామి దేవాలయం సమీపంలో ఈ ఘటన జరగడంతో గుప్త నిధుల కోసం యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బలిచ్చినట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు.
Samayam Telugu kurnool
కర్నూలు హత్య


స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. యువకుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గుప్త నిధుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.