యాప్నగరం

మనవరాలిని చంపేసిన తాతయ్య, నానమ్మ.. విజయవాడలో దారుణం

సొంత కొడుకు బిడ్డను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాతయ్య, నానమ్మలను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Samayam Telugu 23 Jan 2020, 3:00 pm
మానవత్వం మంటగలుస్తోంది. మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఇప్పటి వరకూ కన్న తల్లిదండ్రులను.. ఇంట్లోని వృద్ధులను అంతమొందించిన దారుణ ఘటనలను చూసే ఉంటాం. కానీ.. సొంత తాతయ్య, నానమ్మలు తమ మనవరాలిని అత్యంత కర్కశంగా చంపేసిన ఘటన మృగ్యమైపోతున్న మానవీయ విలువలకు అద్దం పడుతోంది.
Samayam Telugu fire+2


వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ, తాతయ్యను పలకరించేందుకు వచ్చిన ఆ మనవరాలికి అదే చివరి చూపైంది. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన నానమ్మ, తాతయ్యలు ఆమె పాలిట మృత్యుదేవతలుగా మారారు. మనవరాలిని దారుణంగా హతమార్చారు. శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించేసి కాల్చేశారు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

Also Read: కొడుకును చంపేస్తూ జోలపాట.. ముగ్గురు బిడ్డలను రాక్షసంగా హతమార్చిన తల్లి

విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్న తాతయ్య, నానమ్మను చూసేందుకు ఇంటికి వచ్చిన మనవరాలు హేమ(16)ను వాళ్లే దారుణంగా హత్య చేశారు. అనంతరం శవాన్ని గుంటూరు తీసుకెళ్లి కాల్చేశారు. విషయం హేమ తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాతయ్య, నానమ్మలు మనవరాలిని చంపేయడం స్థానికంగా కలకలం రేపింది. సొంత కొడుకు బిడ్డను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మనవరాలిని హత్య చేయడానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది. తాతయ్య, నానమ్మలను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Read Also: ‘నీ కూతురు, అల్లుడు తగలబడుతున్నారు.. చేతనైతే కాపాడుకో’ హంతకుడి ఫోన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.