యాప్నగరం

యువతి ఆత్మహత్య.. పశ్చిమ గోదావరిలో విషాదం

తల్లిదండ్రులు తిట్టారని క్షణికావేశానికి లోనైన యువతి పురుగుల మందు తాగేసింది. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది.

Samayam Telugu 23 Jul 2020, 7:10 pm
చిన్నచిన్న కారణాలకే యువత క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తల్లిదండ్రులు మందలించారని.. టీచర్ కోప్పడ్డారని.. బంధువులు గొడవపడ్డారని మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని యువతి బలవన్మరణానికి పాల్పడింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


జిల్లాలోని జంగారెడ్డి గూడెం మండలం కట్టపొదలవారి గూడెం గ్రామానికి చెందిన యువతి పి.లావణ్య(19) ఆత్మహత్మ చేసుకుంది. పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. అపస్మారక స్థితికి చేరుకున్న యువతిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: బాలికపై వలంటీర్ పవన్ కళ్యాణ్ అత్యాచారం .. నెల్లూరులో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.