యాప్నగరం

చెరువులో శవమై తేలిన ఇంటర్ విద్యార్థిని.. శంషాబాద్‌లో విషాదం

నాలుగు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఇంటర్ విద్యార్థిని అనూహ్యంగా హిమాయత్‌సాగర్‌లో శవమై తేలింది. అనుమానాస్పద స్థితిలో టీనేజ్ యువతి మరణంపై అనుమానాలు..

Samayam Telugu 8 Aug 2020, 8:16 pm
శంషాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగు రోజుల కిందట అర్ధరాత్రి వేళ కనిపించకుండా పోయిన టీనేజ్ యువతి హిమాయత్ సాగర్‌లో శవమై తేలింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్ గూడకు చెందిన టీనేజర్ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 4 వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఆమె అదృశ్య మైంది. చుట్టుపక్కల వెతికిన ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
Samayam Telugu అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టీనేజర్
suspicious death


గతంలో విజయ్ అనే యువకుడి చేతిలో తమ కూతురు మోసపోయిందని.. అతనిపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. విజయ్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోగా అనూహ్యంగా యువతి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్‌ సాగర్‌లో శవమై కనిపించింది. యువతి శవం లభ్యమైందన్న సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అదృశ్యమైన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెది హత్యా? లేక ఆత్మహత్యా? పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Also Read: కాల్వలో శవమై తేలిన లేడీ డాక్టర్.. ఆ 3 గంటల్లో ఏమైంది? విశాఖలో మిస్టరీ మరణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.