యాప్నగరం

కుప్పంలో ఏనుగు బీభత్సం.. కూతురి మృతి, తప్పించుకున్న తండ్రి

వేరుశనగ పంటకు తండ్రీకూతుళ్లు కాపలాగా ఉన్నారు అడవిలో నుంచి వచ్చిన ఏనుగు ఇద్దరిపై దాడి చేసింది. కూతురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

Samayam Telugu 24 Sep 2020, 10:16 am
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. దారితప్పిన ఏనుగు పంటపొలాల్లో బీభత్సం సృష్టించింది. వేరుశనగ పొలానికి కాపలాగా ఉన్న తండ్రీకూతుళ్లపై దాడి చేసింది. ఈ దాడిలో కూతురి సోనియా అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తండ్రి మురుగన్ అక్కడి నుంచి పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


మృత్యువాత పడిన సోనియా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. లాక్‌డౌన్ కారణంగా కళాశాలలు లేకపోవడంతో తండ్రికి సాయంగా ఉండేందుకు పొలానికి వెళ్లి మృత్యువాతపడింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. సమాచారం అందుకున్న జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి కుటుంభ సభ్యులను పరామర్శించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: భర్తని బూడిద చేసి చెరువులో కలిపేసిన భార్య.. ప్రియుడితో కలసి ఘాతుకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.