యాప్నగరం

కోడి పుంజులతో ఈత కొట్టించి.. నీటమునిగిన యువకుడు.. షాకింగ్

తనకు ఈత రాకపోవడంతో బావి ఒడ్డున కూర్చున్నాడు. కోడిపుంజులతో ఈత కొట్టించి సరదా తీర్చుకున్నాడు. ఇంటికెళ్లే ముందు పుట్టిన కోరిక అతని ప్రాణాలు బలి తీసుకుంది.

Samayam Telugu 22 Dec 2020, 10:40 am
స్నేహితులతో సరదాగా కోడిపుంజులు తీసుకుని బావి వద్దకు వెళ్లాడు. వాటితో ఈత కొట్టించి సరదా తీర్చుకున్నాడు. తీరా తాను సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. నానమ్మ కర్రక్రియల కోసం వచ్చిన మనవడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన చిత్తూరులో జిల్లా పలమనేరులో జరిగింది. తమిళనాడులో తిరపత్తూరుకు చెందిన సాదిక్ కుమారుడు ముజిసిర్(17) ఇంటర్ చదువుతున్నాడు. పలమనేరు పట్టనంలోని జెండామఠం ప్రాంతంలో నివాసముండే నానమ్మ కర్మక్రియల కోసం మూడు రోజుల కిందట వచ్చాడు. నానమ్మ అంతిమ సంస్కారాలు ఆదివారం ముగిశాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
drowning


మరుసటి రోజు తన స్నేహితులతో కలసి కోడిపుంజులు తీసుకుని సరదాగా చెరువు కట్టకింద సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. తనకు ఈత రాకపోవడంతో బావిగట్టుపైనే కూర్చున్నాడు. కొద్దిసేపు కోడిపుంజులతో ఈత కొట్టించి సరదా తీర్చుకున్నాడు. తీరా ఇంటికెళ్లే సమయంలో సెల్ఫీ తీసుకోవాలన్న కోరిక అతడి ప్రాణాలను బలిగొంది. బావి ఒడ్డుపై నిల్చుని సెల్ఫీ తీసుకుంటూ పట్టుతప్పి బావిలో పడిపోయాడు. అతని స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే నీటిమునిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కి చేరుకుని యువకుడి మృతదేహాన్ని వెలికితీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ప్రసవం కోసం వెళ్లిన భార్య.. తిరిగొచ్చేసరికి ఊహించని షాకిచ్చిన భర్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.