యాప్నగరం

హైదరాబాద్ ఘటన నిజంగా సిగ్గుచేటు: కోహ్లి ఆవేదన

హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ రేప్, మర్డర్ ఘటనపై టీమిండియా కెప్టెన్ కోహ్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన చూసి తలదించుకున్నానని పేర్కొన్నాడు. ఇకనైనా సమాజంలో ఇలాంటి దారుణాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చాడు.

Samayam Telugu 1 Dec 2019, 9:34 am
హైదరాబాద్ శివారులో యువ వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా చంపేసిన ఘటనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయమని అంటూ ట్వీట్ చేశాడు. ‘హైదరాబాద్‌లో జరిగిన ఘటన నిజంగా సిగ్గుచేటు. మనమందరం సమాజంపై బాధ్యత తీసుకుని ఇలాంటి దారుణాలకు స్వస్తి పలకాలి’ అంటూ కోహ్లి ట్వీట్‌లో పేర్కొన్నాడు. కోహ్లితో పాటు శిఖర్ ధావన్, ఓజా, అమిత్ మిశ్రా సైతం ఈ ఘటనను ఖండిస్తూ ట్వీట్లు చేశారు.
Samayam Telugu pjimage (5)


Also Read: వెటర్నరీ డాక్టర్ రేప్ మర్డర్.. ప్లాన్ వేసింది, ముందుగా అఘాయిత్యానికి పాల్పడింది అతడే

వెటర్నరీ డాక్టర్ అయిన యువతిని నలుగురు కామాంధులు దారుణంగా అత్యాచారానికి పాల్పడి, చంపి దహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా.. 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే నిందితులను తమకు అప్పగించాలంటూ ప్రజలు శనివారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. వారిని బహిరంగంగా ఉరి తీయాలని, పోలీసులకు చేతకాకపోతే నిందితులను తమకు అప్పగించాలని, తామే వారికి తగిన శిక్ష విధిస్తామని ప్రజలు హెచ్చరించారు.

Also Read: హైదరాబాద్‌లో మరో ఘోరం.. మహిళా టెక్కీపై ఫ్రెండ్ అత్యాచారం


Also Read: హైదరాబాద్ నుంచి వైజాగ్ బీచ్‌‌కు వెళ్లిన యువతి.. ఏం జరిగిందంటే..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.