యాప్నగరం

పూజారి బరితెగింపు.. మైనర్ బాలికపై అత్యాచారం

తెలంగాణలోని సిద్ధిపేటలో మైనర్‌ బాలికపై గుడి పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు.

Samayam Telugu 27 Dec 2019, 1:19 pm
ఎంతో గౌరవప్రదమైన పూజారి వృత్తికి కళంకం తెచ్చాడో వ్యక్తి. తెలంగాణలోని సిద్ధిపేటలో మైనర్‌ బాలికపై గుడి పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. సిద్ధిపేటలోని ఓ గుడిలో పూజారిగా పనిచేస్తున్న మహేందర్‌ (23) అనే వ్యక్తి స్థానికంగా 8వ తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానంటూ ఏడాదిగా వెంటబడుతున్నాడు. తర్వాత ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.
Samayam Telugu Teenage


Also Read: వరంగల్‌లో మైనర్ బాలికపై అత్యాచారం

ఈ క్రమంలో తరచూ చనువుగా మాట్లాడుతూ ఇటీవ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంకా బరితెగించి బాలికతో సన్నిహితంగా ఉ‍న్న ఫోటోలను లోకల్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిరుదొడ్డి పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read: వరంగల్‌లో మైనర్ బాలికపై అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.