యాప్నగరం

ఆర్టీసీ అద్దె బస్సు ఎత్తుకెళ్లిన లారీడ్రైవర్.. నిందితుడికి కరోనా లక్షణాలు

గురువారం రాత్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్ డిపోలో నిలిపి ఉంచిన బస్సును లారీ డ్రైవర్ సత్యనారాయణ ఎత్తుకెళ్లాడు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Samayam Telugu 4 Jul 2020, 9:30 am
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్టీసీ అద్దె బస్సు అపహరణకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం పట్టణానికి చెందిన శీలం మల్లయ్య సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో ఎక్స్‌ప్రెస్‌ బస్సును అద్దెకు నడుపుతున్నారు. గురువారం రాత్రి బస్టాండ్‌ ప్రాంగణంలో నిలిపి ఉంచిన బస్సు శుక్రవారం ఉదయానికి కనిపించలేదు. దీనిపై బస్సు యజమానికి సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సును బస్సును తల్లాడకు చెందిన సత్యనారాయణ అనే లారీ డ్రైవర్ ఎత్తుకుపోయినట్లు గుర్తించారు.
Samayam Telugu TSRTC Bus


Also Read: గుడివాడలో గంజాయి దందా గుట్టురట్టు.. పోలీసులపై పెద్దల ఒత్తిడి

చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో బస్సుతో పాటు నిందితుడిని పట్టుకుని సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఇక్కడే పోలీసులకు ఓ చిక్కు వచ్చి పడింది. నిందితుడు సత్యనారాయణ కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో అతడిని వెంటనే సత్తుపల్లి సీహెచ్‌సీకి తరలించారు. సాధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ ఘటనతో సత్తుపల్లి పోలీసులు కలవరపడుతున్నారు.

Also Read: మోజు తీరాక మొహం చాటేసిన ప్రియుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.