యాప్నగరం

షార్జాలో తెలంగాణ వ్యక్తి దారుణహత్య.. 6 నెలల క్రితమే ఉపాధి కోసం

ఉపాధి కోసం ఆరు నెలల క్రితం షార్జాకు వెళ్లిన నవీన్ అక్కడ కార్ వాషింగ్ పనిలో కుదిరాడు. అయితే శనివారం భోజనం చేసే సమయంలో కేరళతో వ్యక్తితో వాగ్వాదం జరిగి హత్యకు గురయ్యాడు.

Samayam Telugu 26 May 2020, 8:08 am
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తి షార్జాలో దారుణ హత్యకు గురయ్యాడు. కోరుట్ల రవీంద్ర రోడ్డుకు చెందిన దేశవేని నర్సయ్య, రాధ దంపతుల రెండో కుమారుడు నవీన్‌(28) ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నగరానికి వెళ్లాడు. అక్కడ షార్జాలోని ఓ కంపెనీలో కారు వాషింగ్‌ చేసేపనిలో కుదిరాడు.
Samayam Telugu Image


Also Read: భార్య గొంతు కోసి చంపేసిన భర్త.. చిత్తూరులో దారుణం

ఈ నెల 23న రాత్రి తన గదిలో నవీన్‌ భోజనం చేస్తుండగా.. కేరళకు చెందిన వ్యక్తితో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి కత్తితో నవీన్‌ను పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సమాచారాన్ని దుబాయిలోని భారత అధికారులు కోరుట్లలోని కుటుంబసభ్యలకు ఆదివారం రాత్రి సమాచారం అందించారు. దీంతో నవీన్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Also Read: అక్రమ సంపాదన కోసం మద్యం అమ్మకాలు.. గుంటూరులో డాక్టర్ అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.