యాప్నగరం

సోషల్‌మీడియాలో ఫేక్ పోస్టులు పెడితే బుక్కైపోతారు.. అడ్మిన్లకూ మూడినట్లే

సోషల్‌మీడియాలో ఫేక్ పోస్టులు, ఓ వర్గాన్ని కించపరుస్తూ ఎలాంటి పోస్టులు చేసినా ఇకమీదట బుక్కైనట్లే. రాచకొండ, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి పోస్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టి సుమోటో కేసులు నమోదు చేస్తున్నారు.

Samayam Telugu 7 Apr 2020, 9:14 am
కరోనా మహమ్మారిపై సోషల్‌మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్న తరుణంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్‌మీడియాలో వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసినా, ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యవహరించినా సైబరాబాద్‌, రాచకొండ అధికారులు సుమోటో కేసులు నమోదు చేస్తున్నారు. ఓ వైపు వైరస్‌ విజృంభణతో ప్రభుత్వం, అధికారులు తలలు పట్టుకుంటుంటే మరోవైపు ట్విటర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌ తదితర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫేక్ న్యూస్ వైరల్‌ అవుతోంది. ఫలానాచోట కరోనా వ్యాపించిందంటూ తప్పుడు పోస్ట్‌లు పెడుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Samayam Telugu telangana police booked cases for fake news on corona virus spreading in social media
సోషల్‌మీడియాలో ఫేక్ పోస్టులు పెడితే బుక్కైపోతారు.. అడ్మిన్లకూ మూడినట్లే


Also Read: వాట్సాప్‌లో సర్పంచ్‌ ఫోటో పెట్టలేదని యువకుడిని చితకబాదారు

ఇంకొందరు మద్యం దుకాణాలను తెరుస్తున్నారంటూ, లాక్‌డౌన్‌ ఎత్తేస్తున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వైరస్ వ్యాప్తికి కారణమంటూ ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియోలూ వైరల్‌గా మారడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సోషల్‌మీడియాలో వర్గాలు, మతాలు, కులాల వారీగా నెటిజన్లు విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. దీంతో ఇలాంటి సోషల్‌మీడియా జాడ్యంపై కన్నేయాలని పోలీసు కమిషనర్లు వీసీ సజ్జనార్‌, మహేష్‌ భగవత్‌ తమ సిబ్బందిని ఆదేశించారు. దీంతో వైరల్‌గా మారిన పోస్టులు, వీడియోలను సైబర్‌ క్రైం పోలీసులు పరిశీలిస్తున్నారు. జాతి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజలను భయాందోళన కలిగించేలా ఉండే పోస్టులను పరిశీలించి తొలగిస్తున్నారు.

Also Read: కారులో గ్యాంగ్‌రేప్, గొంతు నులిమి హత్య.. చేవెళ్ల ‘దిశ’ కేసులో విస్తుపోయే అంశాలు

ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొందరు నెటిజన్లు పట్టించుకోకపోవడంతో రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు రెండు సుమోటో కేసులు, కీసర సీఐ నరేందర్‌ మరో రెండు సుమోటో కేసులు నమోదు చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు అసభ్యకర, ఫేక్ న్యూస్‌లు పోస్ట్ చేసినా అడ్మిన్లపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తుండటంతో వాట్సాప్‌ గ్రూపుల అడ్మిన్లు అప్రమత్తమయ్యారు. కొందరైతే తాము మాత్రమే ఆ గ్రూపుల్లో పోస్టులు పెట్టేలా సెట్టింగ్‌లు మార్చేశారు. మరికొందరు అందరినీ అడ్మిన్లుగా మార్చారు. ఇంకొందరేమో ఫేక్ న్యూస్ పోస్ట్ చేసే సభ్యులను తొలగిస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ఇలాంటి న్యూస్‌ మరింత ప్రమాదమని, అందుకే సుమోటో కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

Also Read: ప్రియుడి మోజులో భర్త హత్య.. సినీఫక్కీలో లారీతో గుద్దించి... మదనపల్లెలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.