యాప్నగరం

కోళ్ల దొంగలు.. కోసుకుతినేశారు! ఓ రైతు వేదన..!

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసమందర్ గ్రామంలో ఓ రైతు ఉపాధి కోసం తెచ్చుకున్న కోళ్లను కొందరు దుండగలు దొంగతనం చేసి కోసుకుని తిన్నారు. దీంతో ఆ రైతు లబోదిబోమంటున్నాడు.

Samayam Telugu 18 Dec 2019, 8:49 pm
ఓ రైతు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కోళ్లను గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి కోసుకుతినేశారు. దీంతో ఆ రైతు లబోదిబోమంటున్నారు. కోళ్ల దొంగల్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆ రైతు విశ్వప్రయత్నాలు చేసినా.. వారు మాత్రం చిక్కకుండా చుక్కలు చూపించి ‘లాగించేశారు. తాను పెంచే కోళ్లు కేజీ రూ. 800 ధర పలుకుతుందని బాధిత రైతు చెబుతున్నాడు. అయితే ఒక కోడి తర్వాత మరొకటి చొప్పున 10 కోళ్లను దొంగలు ‘సఫా’ చేసేశారని ఆ రైతు వాపోయాడు.
Samayam Telugu hens.


Also Read: ఉల్లి దొంగల భరతం పట్టిన పోలీసులు!

అప్పుచేసి మరీ పెంపకం..
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసమందర్ గ్రామంలో భీమయ్య అనే రైతు ఉపాధి కోసం కడక్నాథ్ కోళ్లను తెచ్చుకుని ఇంటి దగ్గర పెంచుకుంటున్నాడు. కేజీ రూ. 800 ఖరీదు చేసే కోళ్లను అప్పు చేసి మరీ తీసుకొచ్చి పెంచుకుంటుంటే దుష్ట దొంగలు వాటిని చంపి తినేశారని రైతు భీమయ్య వాపోయాడు. చివరకు కోళ్ల దొంగలను పట్టుకునేందుకు వేట మొదలుపెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందన్నాడు. రోజుకు ఒక్కో కోడి చొప్పున మొత్తం 10 కోళ్లను దొంగిలించి తినేశారని నెత్తిన చేయి పెట్టుకుని ఉసూరుమంటూ చెప్పాడు భీమయ్య!

Also Read: బంధువులమంటూ ఇంటికొచ్చి.. మెడలో చైన్ లాక్కుని పరార్..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.