యాప్నగరం

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని.. అత్తను హతమార్చిన కోడలు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఓ కోడలు అత్తను దారుణంగా హత్య చేసింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 17 Jan 2020, 2:29 pm
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని సొంత అత్తను దారుణంగా హతమార్చిందో కోడలు. కామారెడ్డి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. రామారెడ్డి ఎస్సై రాజు తెలిపిన వివరాల మేరకు.. రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లికి చెందిన సిద్దం భూదవ్వ సోమవారం రాత్రి నిద్రిస్తుండగా కోడలు నందన బండరాయితో తలపై బలంగా కొట్టి హతమార్చింది. దీన్ని కప్పిపుచ్చేందుకు ఎవరికి అనుమానం రాకుండా కిరోసిన్‌ పోసి తగులబెట్టింది.
Samayam Telugu ablaze


Also Read: భద్రాద్రిలో కీచక ఉప సర్పంచ్.. ఒంటరిగా వస్తున్న మహిళపై..

అనంతరం గట్టిక కేకలు వేస్తూ మంటల్లో అత్త తగులబడిపోతోందంటూ చుట్టుపక్కల వారికి చెప్పింది. దీంతో చుట్టు పక్కల వారు వచ్చి చూడగా అప్పటికే భూదవ్వ మరణించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నందనను అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది.

దీంతో పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా నందన అసలు విషయం బయటపెట్టింది. మేనబావతో అక్రమ సంబంధం వ్యవహారం అత్తకు తెలిసిందని, ఆ విషయం ఎక్కడ బయట పడుతుందేమోనని భయపడి హత్య చేసినట్లు నందన పోలీసుల ముందు నేరం అంగీకరించింది. దీంతో గురువారం నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.

Also Read: పండుగ రోజు మద్యం తాపించి.. 19 కత్తిపోట్లు పొడిచి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.