యాప్నగరం

సిద్దిపేటలో మహిళను స్తంభానికి కట్టేసి.. రాళ్లు, చెప్పులతో కొట్టి..

పొలాల మధ్య దారి విషయంలో వివాదం ఏర్పడగా.. ఓ మహిళపై కొందరు దారుణంగా వ్యవహరించారు. మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి చెప్పులు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.

Samayam Telugu 11 Jan 2020, 11:21 am
తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను స్తంభానికి కట్టేసి.. రాళ్లు, చెప్పులతో దారుణంగా కొట్టారు. పొలం వద్ద దారి విషయంలో మహిళల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఓ మహిళను విద్యుత్‌ స్తంభానికి తాళ్లతో కట్టేసి చెప్పులతో దాడి చేశారు. ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లి తండాకు చెందిన గుగులోతు జ్యోతి, లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన గుగులోతు హంస, స్వరూపలకు చెందిన వ్యవసాయ భూములు పోరెడ్డిపల్లి తండా గ్రామ పరిధిలో ఉన్నాయి.
Samayam Telugu tied pole


Also Read: ప్రేమ.. వంచన.. ఖమ్మం యువతి మౌన పోరాటం

ఈ క్రమంలో వ్యవసాయ బావులకు వెళ్లే రహదారి విషయమై ఆ మహిళలు తరచూ గొడవలకు పాల్పడేవారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న హంస, స్వరూప.. గురువారం సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న జ్యోతిని గమనించారు. అనంతరం కృష్ణ అనే వ్యక్తి సాయంతో జ్యోతిని బలవంతంగా ట్రాక్టర్‌లో ఎక్కించుకొని లక్ష్మీపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను స్తంభానికి కట్టేసి చెప్పులతో విచక్షణారహితంగా దాడిచేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే 100కు పోన్ చేశారు.

వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం బాధితురాలి భర్త శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు హంస, కృష్ణ, స్వరూప, శంకర్, కైలు, రమలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Also Read: అబ్బాయి వేషంతో 50 మంది బాలికలపై రేప్.. విస్తుగొలిపేలా యువతి అకృత్యాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.