యాప్నగరం

అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్లివారిపల్లికి చెందిన గుమ్మడికాయల ద్వారకనాథరెడ్డి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. భారత కాలమాన ప్రకారం గురువారం మధ్యాహ్నం ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 13 Dec 2019, 6:52 pm
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్లివారిపల్లికి చెందిన గుమ్మడికాయల ద్వారకనాథరెడ్డి అమెరికాలో అమెజాన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత కాలమాన ప్రకారం గురువారం మధ్యాహ్నం సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.
Samayam Telugu nri


Also Read: ఇష్టం లేని పెళ్లి చేశారని.. వరుడి బలవన్మరణం!

ఈ మేరకు శుక్రవారం ద్వారకనాథరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ద్వారకనాథరెడ్డికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులుగాని, వివాదాలు గాని లేవని బంధువులు చెబుతున్నారు. ద్వారాకనాథరెడ్డి బలవన్మరణంతో ఆయన స్వస్థలంలో విషాదం నెలకొంది. కాగా, ద్వారకనాథరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read: ఒంగోలు తల్లీబిడ్డల హత్య కేసులో ఒళ్లు గగుడ్పొడిచే దారుణాలు వెలుగులోకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.