యాప్నగరం

కొట్టేసిన కారుతో ఏటీఎం దొంగతనం.. టెక్నాలజీతో ట్విస్ట్ ఇచ్చిన ఓనర్.. చివరికి దిమ్మతిరిగి..

ఓ దొంగల ముఠా మాస్టర్ ప్లాన్ వేసింది. ఏకంగా ఏటీఎంని ఎత్తుకెళ్లేందుకు పథకం పన్నింది. అందుకు రెండు రోజుల ముందే ఓ ఏటీఎంని చోరీ చేసింది. అదే తరహాలో మరో ఏటీఎంని దోపిడీ చేసేందుకు బయల్దేరింది. ప్లాన్‌లో భాగంగా ఓ కారును దొంగిలించింది. కారు ఊహించని ట్విస్ట్‌ ఇవ్వడంతో దొంగలకు దిమ్మతిరిగిపోయింది. బతుకుజీవుడా అనుకుంటూ కారు దిగి అక్కడి నుంచి తలోదారిన పారిపోయారు. ఈ ఆసక్తికర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

Samayam Telugu 20 Feb 2020, 8:17 pm
ఓ దొంగల ముఠా మాస్టర్ ప్లాన్ వేసింది. ఏకంగా ఏటీఎంని ఎత్తుకెళ్లేందుకు పథకం పన్నింది. అందుకు రెండు రోజుల ముందే ఓ ఏటీఎంని చోరీ చేసింది. అదే తరహాలో మరో ఏటీఎంని దోపిడీ చేసేందుకు బయల్దేరింది. ప్లాన్‌లో భాగంగా ఓ కారును దొంగిలించింది. కారు ఊహించని ట్విస్ట్‌ ఇవ్వడంతో దొంగలకు దిమ్మతిరిగిపోయింది. బతుకుజీవుడా అనుకుంటూ కారు దిగి అక్కడి నుంచి తలోదారిన పారిపోయారు. ఈ ఆసక్తికర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
Samayam Telugu thieves uproot atm with stolen suv tricked by owner in delhi
కొట్టేసిన కారుతో ఏటీఎం దొంగతనం.. టెక్నాలజీతో ట్విస్ట్ ఇచ్చిన ఓనర్.. చివరికి దిమ్మతిరిగి..


ఏటీఎం చోరీకి ప్లాన్..

ఢిల్లీకి చెందిన ఓ దొంగల ముఠా ఏటీఎం దోపిడీకి ప్లాన్ చేసింది. అందుకోసం కారును కూడా దొంగతనం చేసి అందులో వెళ్లి ఏటీఎంను ఎత్తుకెళ్లాలని పథకం రూపొందించారు. అందులో సగం పైగా సక్సెస్ అయిన దొంగలు.. తాము దొంగిలించన కారు కారణంగా దొరికిపోయే పరిస్థితి రావడంతో దొంగిలించిన ఏటీఎంని కూడా అక్కడే వదిలేసి పారిపోయారు.


Also Read: పానీపూరి ఇప్పిస్తానని బాలికను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి.. హైదరాబాద్‌లో దారుణం

ముందుగా కారు చోరీ..

ముందుగా నరైన్ ప్రాంతంలోని ఓ కార్యాలయంలో పార్కింగ్‌లో ఉంచిన బొలెరో కారుని చోరీ చేశారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం తాము రెక్కీ నిర్వహించిన ప్రాంతానికి వెళ్లి ఏటీఎం మెషీన్‌ని ఎత్తేశారు. అక్కడి సిబ్బంది తలకి తుపాకీలు గురిపెట్టి మరీ తాళ్లతో సహా ఎత్తుకెళ్లి కారులో పడేశారు. అక్కడి నుంచి పారిపోయేందుకు బయలుదేరారు.

వెంబడించిన ఓనర్..

ఇంతలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కారు దొంగిలించిన వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది విషయాన్ని యజమానికి తెలియజేశారు. వెంటనే ఆయన అప్రమత్తమై తన కొడుకుతో సహా కారు ఎక్కడుందో గుర్తించే పనిలో పడ్డారు. కారులో అమర్చిన జీపీఎస్ సాయంతో కారు ఎక్కడెక్కడికి వెళ్తుందో గమనిస్తూ వెనకే వేరే కారులో ఫాలో అయ్యారు.


Read Also: చెల్లెలిని కిరాతకంగా చంపేసిన అన్న.. ‘అక్కడ’ తుపాకీ పెట్టి అమానుషంగా..

నడిరోడ్డుపై నిలిచిపోయిన కారు..

జీపీఎస్ ద్వారా కారుని ఫాలో అవుతూనే చోరీ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు బయలుదేరారు. ఇంతలో యజమాని కారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడికి చేరుకున్నారు. కారు సమీపంలోకి వచ్చిన తరువాత రిమోట్‌తో ఇంజిన్ ఆఫ్ చేసేశాడు ఓనర్. ఇక అంతే.. అక్కడి నుంచి కారు ముందుకు కదల్లేదు. అప్పటి వరకూ బాగానే వచ్చిన కారు సడెన్‌గా ఆగిపోవడంతో దొంగలకు చెమటలు పట్టాయి. దొరికిపోతామేమోనని భయపడి కారు దిగి అక్కడి నుంచి పారిపోయారు.


Also Read: భర్తతో సెక్స్ చేసేందుకు యువతితో భార్య అగ్రిమెంట్.. దంపతులపై రేప్ కేస్.. దిమ్మతిరిగిపోయే ట్విస్టులు

కారులో ఏటీఎంని చూసి షాక్

కారును వెతుక్కుంటూ వచ్చిన యజమాని కారు వద్దకు వెళ్లి చూశారు. అందులో ఎవరూ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే కారు వెనక ఉన్న తాళ్లతో కట్టి ఉన్న ఏటీఎంని చూసి బిత్తరపోయారు. ఏటీఎంని దొంగిలించేందుకు కారుని దొంగిలించడం చూసి విస్తుపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఏటీఎంను స్వాధీనం చేసుకుని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: మగతనం లేదని వదిలేసిన భార్య.. కోపంతో తండ్రిని చంపేసిన కొడుకు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.