యాప్నగరం

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు..

రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం మండలంలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 31 Oct 2020, 4:03 pm
ఏపీలో మరోమారు రోడ్లు రక్తసిక్తమయ్యాయి. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం మండలం గోళ్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కారు ఢీకొన్న ధాటికి బైకులు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోకుండా సహాయక చర్యలు చేపట్టారు. అయితే మృతుల్లో స్థానిక రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) ఆస్పత్రి వైద్యురాలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న బైకులు
accident


Also Read: మరదలి ప్రేమలో భర్త.. భరించలేని భార్య పెట్రోల్ పోసి.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.