యాప్నగరం

Guntur: కుక్కను తప్పించబోయి గాల్లోకి లేచిన కారు.. ముగ్గురు మృతి

అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పడంతో పల్టీలు కొడుతూ అమాంతం గాల్లోకి లేచింది. అదే వేగంతో వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడింది. ఈ ఘటనలో ముగ్గురు..

Samayam Telugu 1 Sep 2020, 3:10 pm
పింఛను తీసుకునేందుకు కారులో బయలుదేరిన తల్లీకూతుళ్లు ప్రమాదంలో మృత్యువాతపడిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. కుక్క అడ్డు రావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలోని కాసారంలో నివాసం ఉంటున్న వెంకట రమణమ్మ(46) ఓ ఇంజనీరింగ్ కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. తన తల్లి రమణమ్మ(71)తో కలసి పింఛను తెచ్చుకునేందుకు స్వగ్రామం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండలమ్మపాలేనికి కారులో బయలుదేరారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


అద్దంకి - నార్కెట్‌పల్లి హైవేపై దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై కుక్క అడ్డురావడంతో తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పడంతో పల్టీలు కొడుతూ గాల్లోకి లేచింది. రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు రమణమ్మ, వెంకటరమణమ్మ సహా కారు డ్రైవర్ శ్రీకాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రమణమ్మ కుమారుడు వేణు, అతని స్నేహితుడు సందీప్ యాదవ్‌కి తీవ్రగాయాలు కావడంతో గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: సాటి మగాడితో సెక్స్ కోరిక.. బుక్కైన భర్త.. భార్యకి తెలిసిపోతుందేమోనని..


Also Read: తప్పతాగి పోలీసుల అరాచకం.. లేడీ ఆఫీసర్‌ని వేధించి.. ఆమె బావ దారుణ హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.