యాప్నగరం

ప్రకాశంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు స్నేహితులు..

క్రిస్మస్ పండుగ సంబరాలు అంబరాన్నంటాలని భావించారు. అందుకోసం భారీ స్టార్ ఏర్పాటు చేయాలని అవసరమైన వస్తువులు తెచ్చేందుకు వెళ్తూ ముగ్గురు మిత్రులు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 16 Dec 2020, 2:09 pm
ప్రకాశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ స్టార్ తీసుకొద్దామని వెళ్తున్న ముగ్గురు యువకులను మృత్యువు కబళించింది. ఓవర్‌టేక్ చేయబోయి బైక్ లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మిత్రులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ అత్యంత విషాద ఘటన మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై జరిగింది. మద్దిపాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బల్లికురవ మండలం వెలమవారిపాలెంలోని కొత్త జమ్మలమడక కాలనీకి చెందిన చిట్లూరి ఏసయ్య (30), అతని తమ్ముడు మాతయ్య(25), నూనె కోటేశ్వరరావు(25) చిన్ననాటి నుంచి స్నేహితులు. స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


క్రిస్మస్ పండుగ సమీపిస్తుండడంతో కాలనీలో క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేయాలని భావించారు. అందుకు అవసరమైన వస్తువులు తీసుకొచ్చేందుకు ముగ్గురూ బైక్‌పై గుంటూరు వినుకొండ వెళ్లారు. అక్కడ అవసరమైన వస్తువులు లభించకపోవడంతో గ్రామానికి తిరిగొచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఒంగోలు బయలుదేరారు. ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్ వద్ద వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టారు. తీవ్రగాయాలపాలైన ముగ్గురూ స్పాట్‌లోనే మృత్యువాతపడ్డారు. పండుగ కోసం వెళ్లిన యువకులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

Also Read: కాబోయే భర్తకి ఆమె ఫొటోలు, మాజీ ప్రియుడి పైశాచికం.. సూర్యాపేటలో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.