యాప్నగరం

తోటకెళ్లిన విద్యార్థులు తిరిగిరాలేదు.. తూర్పు గోదావరిలో విషాదం

ఫ్రెండ్ బర్త్ డే తోటలో ప్లాన్ చేశారు. అక్కడికెళ్లి స్నేహితుడితో కేక్ కట్ చేయించి సంతోషంగా గడిపారు. పక్కనే ఉన్న పోలవరం కాల్వలో ఈతకు దిగి కనిపించకుండా పోయారు.

Samayam Telugu 31 Jul 2020, 7:58 pm
స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం గ్రామానికి సమీపంలోని తోటకెళ్లిన విద్యార్థులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సరదాగా ఈత కొడదామని పోలవరం కాల్వలో దిగి గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తుని మండలం హంసవరానికి చెందిన కాలిబోయిన పృద్వి(14), మఠం హరీష్(17), కిల్లాడ మణికంఠ(13) స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం గ్రామ సమీపంలోని తోటకి వెళ్లారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
missing


ఫ్రెండ్ కేక్ కటింగ్ అనంతరం సరదాగా ఈత కొడదామని పక్కనే ఉన్న పోలవరం కాల్వలో దిగారు. నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. విద్యార్థులు గల్లంతయ్యారని తెలుసుకుని గ్రామస్తులు కాల్వ వద్దకు చేరుకుని కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతో కలసి గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారిలో హరీష్ పదో తరగతి పూర్తి చేశాడు. పృద్వి పదో తరగతి, మణికంఠ ఎనిమిదో తరగతి చదువుతున్నారు.

Also Read: ప్రైవేట్ పార్ట్స్‌లో చీపురు పెట్టి.. సవతి తండ్రి శాడిజం, ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.