యాప్నగరం

తండ్రితో పొలం వెళ్లిన మూడేళ్ల చిన్నారి.. సజీవ దహనం

తండ్రితో పొలం వెళ్లిన చిన్నారి తిరిగిరాలేదు. వెళ్లిన వాహనంలోనే విగతజీవిగా మారింది. అగ్నికీలలు చుట్టుముట్టడంతో తీవ్రగాయాలపాలై మృతి చెందింది.

Samayam Telugu 24 Dec 2020, 11:05 am
ముద్దుముద్దు మాటలతో సందడి చేసే మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ సజీవ దహనమైన విషాద ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తండ్రితో పొలం వెళ్లిన కూతురు కారులో ఆడుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులోనే ఉన్న చిన్నారి మంటల్లో కాలిపోయి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన క్రోసూరు మండలం బయ్యవరంలో జరిగింది. గ్రామానికి చెందిన కడియం మణికంఠ తన మూడేళ్ల కూతురు శ్రీనిధిని బొలెరో ట్రక్కు వాహనంలో ఎక్కించుకుని పొలం తీసుకెళ్లాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


వరిపొలంలో పంట నూర్పిడి పనులు చేసుకుంటూ చిన్నారిని వాహనంలోనే కూర్చోబెట్టాడు. హఠాత్తుగా కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. వాహనంలోనే ఆడుకుంటున్న చిన్నారి తీవ్రగాయాలపాలవడంతో వెంటనే ఆమెను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: కొడుకు పెళ్లి చూపులే తల్లికి చివరి చూపులు.. ప్రకాశంలో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.