యాప్నగరం

కృష్ణా జిల్లాలో దారి దోపిడీ.. రొయ్యలను దోచుకెళ్లిన దుండగులు

ఏపీలో దారిదోపిడీ ఘటన జరిగింది. లారీని అడ్డగించి రొయ్యలను దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ డ్రైవర్‌ను కట్టేసి రొయ్యలు దొంగతనం చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Samayam Telugu 24 Jan 2020, 7:02 pm
దారిదోపిడీ ఘటనల్లో విలువైన వజ్రాలు.. బంగారం.. నగదు అపహరించుకుపోయే వాళ్లను చూసుంటాం. కానీ ఓ సరికొత్త దోపిడీ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. లారీలో తరలిస్తున్న రొయ్యలను దోపిడీ చేసిందో ముఠా. రొయ్యల లోడుతో వెళ్తున్న లారీని అటకాయించి లక్షల రూపాయల విలువైన రొయ్యలను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది.
Samayam Telugu prawns


కృష్ణా జిల్లాలో దారిదోపిడీ ఘటన చోటుచేసుకుంది. లక్షల రూపాయల విలువైన రొయ్యలను దొంగలు సినిమా స్టైల్‌లో దోచుకుపోయారు. ఈ ఘటన పామర్రు మండలం కొమరవోలు వద్ద జరిగింది. రొయ్యల లోడుతో వస్తున్న లారీని కొమరవోలు వద్ద అడ్డగించిన దుండగులు లారీ డ్రైవర్‌ను కిందికి దించారు. డ్రైవర్‌ను చెట్టుకు కట్టేసి రూ.11 లక్షల విలువైన రొయ్యలను దోచుకెళ్లారు.

Also Read: ఒంగోలులో ఘోరం.. బాలికను బలవంతంగా లాక్కెళ్లి..

ఎలాగోలా బయటపడిన లారీ డ్రైవర్ పామర్రు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. దారికాచి మరీ రొయ్యల దోపిడీకి పాల్పడడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దోపిడీ దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.