యాప్నగరం

పట్టపగలు సొంతింట్లోనే పనిమనిషి సహా మాజీ మేయర్ దంపతుల హత్య

Tamil Nadu | తిరునెల్వేలిలో దారుణం చోటు చేసుకుంది. మాజీ మేయర్ దంపతులు సహా ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. పట్టపగలే ముగ్గురు హత్యకు గురవడం తమిళనాట సంచలనంగా మారింది.

Samayam Telugu 23 Jul 2019, 9:58 pm
మూడున్నరేళ్ల క్రితం చిత్తూరు మేయర్‌ కడారి అనురాధ, ఆమె భర్తను దుండగులు దారుణంగా పొడిచి చంపిన ఘటన గుర్తుందా? ఇదే తరహాలో తమిళనాడులోని తిరునెల్వేలిలో మాజీ మేయర్, ఆమె భర్తతోపాటు పనిమనిషి దుండగులు దారుణంగా హతమార్చారు. 1996 నుంచి 2001 మధ్య తిరునెల్వేలి కార్పొరేషన్ మేయర్‌గా పని చేసిన ఉమ మహేశ్వరి (61), ఆమె భర్త మురుగ శంకర్ (65), పని మనిషిని మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారి ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆస్తి వివాదమే ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు.
Samayam Telugu murder2


మాజీ మేయర్ దంపతుల కుమార్తె సమీపంలోనే నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులను చూసి వెళ్లడం కోసం వచ్చిన ఆమెకు వారిద్దరితోపాటు పనిమనిషి విగత జీవులుగా కనిపించారు. మాజీ మేయర్ దంపతుల హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుండగులు పట్టపగలే ఇంట్లోకి ఎలా ప్రవేశించగలిగారనే కోణంలో విచారిస్తున్నారు. ఈ హత్యల వెనుక రాజకీయ ప్రమేయం లేదని ప్రాథమిక విచారణలో తేలింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.