యాప్నగరం

తిరుపతి స్వామివారి ఆభరణాలు తాకట్టు.. మాజీ ప్రధాన అర్చకుడికి జైలు.. షాకింగ్

స్వామివారి కైంకర్యాలను పర్యవేక్షించాల్సిన ప్రధాన అర్చకుడు దేవుని నగలకు ఎసరుపెట్టాడు. ఎంచక్కా మాయం చేసేసి కుదువ దుకాణంలో పెట్టి నగదు స్వాహా చేశాడు.

Samayam Telugu 1 Oct 2020, 4:15 pm
రోజూ పూజలు చేస్తూ దేవుని సేవలో తరించే ప్రధాన అర్చకుడు ఏకంగా స్వామివారి నగలకే ఎసరు పెట్టాడు. స్వామివారి ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బులు స్వాహా చేసినట్లు తేలడంతో జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ షాకింగ్ ఘటన వివరాలు.. తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో 2009లో అప్పటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో స్వామివారి నగలు మాయమైనట్లు గుర్తించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ornaments missing


అప్పటి ప్రధాన అర్చకుడు వెంకటరమణ దీక్షితులుని ప్రశ్నించడంతో షాకింగ్ విషయం బయటపడింది. ఏకంగా స్వామివారి ఆభరణాలను బయట ఓ దుకాణంలో కుదువపెట్టినట్టు తేలింది. ఆభరణాలు మాయం చేసిన ప్రధాన అర్చకుడు దీక్షితులుతో పాటు తాకట్టు దుకాణం యజమానులు తిరుపతి బజారువీధికి చెందిన ఎం.సగర్మాల్, కోటకొమ్మలవీధికి చెందిన రాఘవరెడ్డిపై తిరుపతి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Also Read: లాక్‌డౌన్‌లో చీరల కోసం వెళ్లిన లేడీ డాక్టర్.. షాపుకి షట్టర్ వేసి.. అనంతపురంలో దారుణం

ఆ కేసును విచారించిన న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే నిందితులు అప్పీలుకు జిల్లా కోర్టును ఆశ్రయించారు. అప్పీలుపై విచారణ జరిపిన జిల్లా కోర్టు అర్చకుడు వెంకటరమణ దీక్షితులుకి ఆరునెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. నిర్ణీత గడువులోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. మిగిలిన ఇద్దరిపై కేసు కొట్టివేసింది.

Read Also: 5 నెలల గర్భిణిపై ఘోరం.. కర్నూలులో అమానుషం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.