యాప్నగరం

విద్యార్థులతో హెడ్మాస్టర్‌ అసభ్య ప్రవర్తన.. తల్లిదండ్రుల దాడి!

తిరుపతిలోని ఓ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిపై దాడికి దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను రక్షించారు.

Samayam Telugu 24 Dec 2019, 5:00 pm
తమ పిల్లలతో ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, పాఠశాలలోనే ఉపాధ్యాయురాలితో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ప్రధానోపాధ్యాయుడు మాకొద్దంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటు చేసుకుంది.
Samayam Telugu attack


Also Read: విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. హెడ్‌మాస్టర్‌ను చితక్కొట్టిన పేరెంట్స్

తిరుపతి నగర పరిధి సత్యనారాయణపురంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు సోమవారం ఉదయం విద్యార్థులు, తల్లిదండ్రులు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు రవీంద్రయ్యపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విద్యార్థినులతో హెడ్మాస్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. అలాగే పాఠశాలలో తనతో పాటే పనిచేసే ఉపాధ్యాయురాలుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

అయితే నిజనిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయవద్దని, తనపై కోపంతో కొందరు ఉపాధ్యాయలు, విద్యార్థులు కలిసి ఇలా కుట్ర పన్నారని ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనపై దాడికి దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను రక్షించారు.

Also Read: ఐదో తరగతి బాలికలపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.