యాప్నగరం

హైదరాబాద్‌లో కిడ్నాప్ కలకలం.. రియల్ఎస్టేట్ వ్యాపారిని వెంబడించి

రియల్ ఎస్టేట్ వ్యాపారి యాదగిరిని ఎల్బీనగర్‌లో వెంబడించిన దుండగులు ఆయన్ని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన కేకలు వేయడంతో సెల్‌ఫోన్, కారు తీసుకుని పరారయ్యారు.

Samayam Telugu 25 Nov 2019, 3:40 pm
హైదరాబాద్ నగరంలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. నగర శివారు ప్రాంతమైన ఎల్బీనగర్‌లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఎల్బీనగర్‌కు చెందిన యాదగిరిరెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం ఉదయం ఆయన ఇంటి నుంచి కారులో బయలుదేరినప్పటి నుంచి కొందరు వెంబడించారు.
Samayam Telugu kidnap


Also Read: కదులుతున్న కారులో యువతిని రేప్ చేస్తూ.. వీడియో తీసి పైశాచికం

ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆయన్ని అడ్డగించి దౌర్జన్యం చేశారు. బలవంతంగా కారులో ఎక్కించడానికి ప్రయత్నించారు. బాధితుడు కేకలు వేయడంతో కొందరు స్థానికులు అటువైపు వచ్చారు. దీంతో దుండగులు యాదగిరిని వదిలేని ఆయన సెల్‌ఫోన్‌ దొంగిలించి ఆయన కారులోనే పరారయ్యారు.

Also Read: గోవా బీచ్‌ల్లో హద్దులు దాటుతున్న వ్యభిచారం.. టూరిస్ట్‌లే టార్గెట్

కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకున్న యాదగిరి ముందుగా ఇంటికి పరుగులు తీశాడు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల గుర్తింపు కోసం సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Also Read: రైలు పట్టాలపై పడుకున్న కడప ప్రేమజంట.. పోలీసులను చూసి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.