యాప్నగరం

గుంటూరు: బాలికపై టీచర్ అత్యాచారం.. భార్య సహకారంతో ఇంట్లోనే..

ట్యూషన్‌కు వచ్చే బాలికపై కన్నేసిన టీచర్.. ఆరు నెలలుగా ఇంట్లోనే అఘాయిత్యం.. సహకరించిన భార్య. ఆలస్యంగా బయటపడిన దారుణం.. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో ఘటన.

Samayam Telugu 28 Dec 2019, 12:09 pm
విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ కామాంధుడిలా మారాడు. కూతురు వయసున్న బాలికపై ఇంట్లోనే అత్యాచారానికి ఒడిగట్టాడు.. అడ్డుకోవాల్సిన భార్య కూడా సహకరించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కొలనుకొండలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది.
Samayam Telugu gnt


కొలనుకొండలో ఖాశీం అనే వ్యక్తి ఉర్దూలో హోమ్ ట్యూషన్ చెబుతున్నాడు. అతడి ఇంటికి ట్యూషన్ కోసం వచ్చే బాలికపై కన్నేశాడు.. ఆమెకు మాయ మాటలు చెప్పి.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టాడు. గత ఆరు నెలలుగా ఈ దారుణం జరుగుతోంది. ఈ విషయం బయటకు రావడంతో కొంతమంది పెద్దల సహకారంతో రాజీ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బాలికను హాస్టల్‌కు తరలించారు.

హాస్టల్‌కు వెళ్లిన బాలికను ఆ కామాంధుడు వదల్లేదు. మళ్లీ బాలికను తీసుకొచ్చి మూడు రోజులుగా అత్యాచారం చేశాడు. తన ఇంట్లోనే బంధించి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. అతడి భార్య అడ్డుకోవాల్సిందిపోయి సహకరించింది. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.