యాప్నగరం

ప్రముఖ టీవీ యాంకర్ భర్త ఆత్మహత్య! అక్రమ సంబంధమే కారణమా?

బుల్లితెర నటి, టీవీ వ్యాఖ్యాత రేఖ భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోని జేజే నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 28 Dec 2019, 2:10 pm
ప్రముఖ బుల్లితెర నటి, టీవీ వ్యాఖ్యాత భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోని పెరంబూరు ప్రాంతంలో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పెరంబూరు, నటరాజన్‌ కోవిల్‌ వీధికి చెందిన గోపీనాథ్‌ (39) స్థానిక అన్నానగర్, టీవీఎస్‌ కాలనీలోని ఓ ప్రైవేట్‌ ప్రచార సంస్థలో కార్యనిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య రేఖ బుల్లితెర నటిగా, వ్యాఖ్యాతగా రాణిస్తోంది. పదేళ్ల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.
Samayam Telugu gopi, rekha


Also Read: షాక్.. ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య

ఈ నేపథ్యంలో 6 నెలల క్రితం గోపీనాథ్‌ జేజే నగర్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అయితే అక్కడ అదే సంస్థలో పని చేస్తున్న ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే విషయమై గత బుధవారం కూడా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో బుధవారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కార్యాలయానికి సెలవు అయినా గోపీనాథ్ ఆఫీస్‌కు వచ్చాడు. కార్యాలయంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు గురువారం ఉద్యోగులు వచ్చి చూడగా.. గోపీనాథ్ ఉరేసుకుని ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జేజే నగర్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని కీల్‌పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కాగా, భార్య రేఖతో గొడవ కారణంగానే గోపీనాథ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అలాగే ఆయనకు అప్పుల బాధ కూడా ఉన్నట్లు తెలిసింది.

Also Read: షాకింగ్.. తెలంగాణ హాస్టల్‌లో గర్భం దాల్చిన నలుగురు డిగ్రీ విద్యార్థినులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.