యాప్నగరం

కత్తులతో పొడుచుకున్న స్నేహితులు.. విజయవాడలో దారుణం

స్థలం విషయం సెటిల్ చేసేందుకు సందీప్ డీల్ కుదుర్చుకున్నాడు. అది తెలియని పండు అదే విషయంలో జోక్యం చేసుకున్నాడు. చివరికి అది స్నేహితుల మధ్య చిచ్చురాజేసింది.

Samayam Telugu 31 May 2020, 1:52 pm
స్థలం సెటి‌ల్‌మెంట్ వ్యవహారం ప్రాణస్నేహితుల మధ్య వైరాన్ని రగిల్చింది. తన మాటే నెగ్గాలన్న ఆధిపత్యంతో ఒకరినొకరు చంపుకునేందుకు కూడా సిద్ధమైపోయారు. చర్చల కోసం వచ్చి ఒకరొనొకరు కత్తులతో పొడుచుకున్న దారుణ ఘటన విజయవాడ నగరంలో చోటచేసుకుంది. నగరంలోని పటమట ప్రాంతానికి చెందిన కోట సందీప్, అదే ఏరియాకి చెందిన పండు స్నేహితులు. సందీప్ పటమటలోనే ఐరన్ వ్యాపారం చేస్తున్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఇటీవల పెనమలూరు పరిధిలోని ఓ స్థలం విషయమై ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. స్థలం సెటిల్‌మెంట్ చేసేందుకు సందీప్ ఒప్పుకున్నాడు. అదే స్థలం విషయంలో పండు కూడా జోక్యం చేసుకోవడంతో స్నేహితుల మధ్య దూరం పెరిగింది. ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు స్థలం సెటిల్‌మెంట్ చేసేందుకు ఒప్పుకోవడం.. ఆధిపత్యం కోసం ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది.

Also Read: మరిదితో వదిన రాసలీలలు.. భర్తకి దొరికిపోవడంతో..

ఈ నేపథ్యంలో స్నేహితులిద్దరూ మాట్లాడుకుందామన్న ఆలోచనకు వచ్చారు. డొంకరోడ్డులో కలసి మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఏమైనా తేడా వస్తే స్నేహితుడిని చంపేసేందుకు కూడా సిద్ధమైన ఇద్దరు.. వెంట తెచ్చుకున్న కత్తులతో ఒకరినొకరు పొడిచేసుకున్నారు. పరస్పర కత్తుల దాడులతో పటమట ఏరియాలో కలకలం రేగింది.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని కత్తిపోట్లకు గురైన సందీప్, పండును వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సెటిల్‌మెంట్ డీల్ కోసం స్నేహితులు ఒకరినొకరు పొడిచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Read Also: వీడియో కాల్స్‌లో శృంగారం.. రూటుమార్చిన సెక్స్ వర్కర్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.