యాప్నగరం

ఇద్దరు బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్.. విశాఖలో కీచకపర్వం

సోమవారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన బాలికను నమ్మించి కారు ఎక్కించుకున్న ఐదుగురు యువకులు వారిని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Samayam Telugu 4 Mar 2020, 10:10 am
విశాఖ జిల్లా మన్యంలో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరగ్గా బాలికల తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu girl rape


Also Read: భార్యంటే పిచ్చి ప్రేమ.. ఆమె మరణాన్ని తట్టుకోలేక పిల్లలతో కలిసి ఆత్మహత్య

అరకులోయ మండలం రంపుడువలస గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు సోమవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లారు. ఆ సమయంలో కారులో వచ్చిన రేగ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు అరకులోయలో జరుగుతున్న జాతరకు వెళ్దామని చెప్పి వారిని కారులో ఎక్కించుకున్నారు. అరకులోయ చేరుకుని జాతర ఈ రోజు లేదని చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో జనంగుడ గ్రామం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికలను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Also Read: 10 మందితో ఆంటీ అఫైర్.. రాత్రివేళ ఇంటికొచ్చిన ఆటోడ్రైవర్.. ఫోన్ మోగడంతో

బాలికల కేకలు విన్న స్థానికులు అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు. బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా జనంగుడ గ్రామస్థులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన గోపితో పాటు అతడి నలుగురు స్నేహితులను కఠినంగా శిక్షించాలని మంగళవారం బాధితుల బంధువులు, ప్రజాసంఘాలు నాయకులు అరకులోయలో ఆందోళన చేపట్టారు.

Also Read: 14ఏళ్ల బాలుడితో ఆంటీ అఫైర్.. భర్తకు నైట్ డ్యూటీ.. ప్రియుడితో రాత్రంతా అదే పని

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.