యాప్నగరం

ఆటలాడుతూ మృత్యుఒడికి చిన్నారులు.. జగిత్యాలలో విషాదం

ఆటలాడుకుంటున్న చిన్నారులు కనిపించకుండాపోయారు. కొద్దిసేపటికి గమనించిన కుటుం బ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఇంటికి సమీపంలోని సెప్టిక్ ట్యాంక్ తొట్టిలో వారిని చూసి..

Samayam Telugu 7 Aug 2020, 9:48 pm
కారు డోర్ లాక్ అయ్యి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన మరువకముందే మరో విషాద ఘటన వెలుగుచూసింది. ఆటలాడుకుంటూ వెళ్లి సెప్టిక్ ట్యాంక్ తొట్టిలో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మేడిపల్లికి చెందిన జలంధర్ కుమారుడు అశ్వంత్(5), అతని సోదరి కుమార్తె రుతిక(7) ప్రమాదవశాత్తూ తొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారులు కనిపించకుండా పోయారు.
Samayam Telugu మృతి చెందిన చిన్నారులు
jagitial kids died


చిన్నారులను ఎవరూ గమనించకపోవడంతో ఘోరం జరిగిపోయినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత పిల్లలు కనిపించడం లేదని కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. సెప్టిక్ ట్యాంక్ తొట్టిలో అచేతనంగా కనిపించడంతో వెంటనే బయటికి తీసి జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రుతిక తల్లితో కలసి అమ్మమ్మ ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: మగ వ్యభిచారులతో శృంగారం.. కస్టమర్ డబ్బులు ఎగ్గొట్టడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.