యాప్నగరం

హెల్మెట్ ఉంటే వేరేలా ఉండేదేమో!! గుంటూరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

వేగంగా వస్తున్న ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు రోడ్డుపై పడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 10 Sep 2020, 11:58 am
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు మాచవరానికి చెందిన అక్కేనా కనకయ్య (45), శ్రీను (35)గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బైక్‌ని ఢీకొట్టిన ఆటో పక్కనే పొలాల్లోకి దూసుకెళ్లింది.
Samayam Telugu ప్రమాద స్థలంలో మృతులు
accident


ఆటోను ఢీకొని బైక్ పడిపోవడంతో కనకయ్య, శ్రీను రోడ్డుపై పడిపోయారు. తలలు రోడ్డుకి బలంగా తగలడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అదే బైక్‌ నడుపుతున్న సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం నుంచి బయటపడే ఉండే అవకాశాలుండేవి. కనీసం హెల్మెట్ కూడా లేకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. నడిరోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయాలై బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న నకరికల్లు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: పెట్రోల్ పోసుకుని మంటల్లో కాలిపోయిన ప్రేమజంట.. నల్గొండలో కలకలం

Also Read: లారీతో వదిన కాళ్లు తొక్కించి.. మరిది ఘాతుకం.. గుంటూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.