యాప్నగరం

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకుల దుర్మరణం

అతివేగం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. కారు, ఐషర్ లారీ ఢీకొనడంతో తల్లీకొడుకులు ప్రాణాలు విడిచిన విషాద ఘటన జరిగింది.

Samayam Telugu 14 Jun 2020, 6:31 pm
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ, కారు ఢీకొనడంతో తల్లీకొడుకులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తున్న కారు, ఐషర్ లారీ చిత్తూరు రింగ్ రోడ్డు సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన వారిని అతికష్టమ్మీద బయటికి తీసి రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన కార్తీక్ రెడ్డి, అతని తల్లి లక్ష్మి ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. సందీప్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కీచకుడిగా మారిన హెడ్మాస్టర్.. పదేళ్ల బాలికను ఆఫీస్ రూమ్‌కి తీసుకెళ్లి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.