యాప్నగరం

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే అన్నదమ్ములు మృతి

అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పింది. ఒక్కసారిగా రోడ్డుదిగి దూసుకెళ్లి చెట్టుకుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడం బాధాకరం.

Samayam Telugu 10 Sep 2020, 11:10 am
విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అమాంతం చెట్టుని ఢీకొట్టడంతో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ నాతవర - తాండవ కూడలి అగ్రహారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఒక్కసారిగా చెట్టును ఢీ కొట్టింది. కారులో ప్రమాణిస్తున్న అన్నదమ్ములిద్దరు అక్కడికక్కడే చనిపోయారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


కారు చెట్టుని ఢీకొట్టిన వేగానికి మృతదేహం కారులో ఇరుక్కుపోయింది. మరొకరు కారులో నుంచి బయటపడి ప్రాణాలొదిలారు. గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ అత్యంత విషాదకర ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: భార్య ఎదుటే మహిళని రేప్ చేసిన భర్త.. సహకరించిన మహాఇల్లాలు

Also Read: లారీతో వదిన కాళ్లు తొక్కించి.. మరిది ఘాతుకం.. గుంటూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.