యాప్నగరం

సైకిల్‌పై సొంతూరికి బయల్దేరిన యువకులు దారిలోనే.. పశ్చిమ గోదావరిలో విషాదం

కరోనా లాక్‌డౌన్ కారణంగా సైకిల్‌పై సొంతూరికి బయల్దేరిని ఇద్దరు యువకులు మార్గంలోనే మృత్యువాతపడిన విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.

Samayam Telugu 25 Apr 2020, 1:20 pm
సైకిల్‌పై సొంతూరికి బయల్దేరిన ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు మింగేసింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో ఒకరు స్పాట్‌లోనే చనిపోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే చనిపోయిన యువకులు ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


జాతీయ రహదారిపై ఉంగుటూరు మండలం కైకరం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. లాక్‌డౌన్ కారణంగా ఏలూరులో చిక్కుకుపోయిన ఇద్దరు యువకులు సైకిల్‌పై తాడేపల్లి గూడెం బయల్దేరినట్లు తెలుస్తోంది. కైకరం వద్ద గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు ఎగిరి రోడ్డుపై పడిపోయారు.

Also Read: ఇంట్లో ఒంటరిగా పదేళ్ల బాలిక.. గుంటూరు జిల్లాలో దారుణం

తీవ్రగాయాలు కావడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరిని సమీపంలోని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుల వివరాలు తెలియకపోవడంతో వారి వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు.

Read Also: ‘మెదడు, మనసు నాకు శత్రువులు..’ నెల్లూరు యువకుడి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.