యాప్నగరం

పశ్చిమ గోదావరిలో ఘోర ప్రమాదం.. తలలు ఛిద్రమై యువకులు..

ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. లారీ ఢీకొనడంతో తలలు ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టీ నర్సాపురం వద్ద ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 28 Nov 2020, 3:15 pm
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ని వేగంగా వచ్చిన లారీ బైక్‌ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. తలల ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన టీ నర్సాపురం మండలం బొర్రపాలెం గ్రామ శివారులో జరిగింది. బైక్‌పై వెళ్తున్న యువకులను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకులు
accident


తలలు ఛిద్రమై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతులను సమీపంలోని జోగన్నపాలెం ప్రాంతానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

హెల్మెట్ ఉంటే.!
రోడ్డు ప్రమాదంలో తలలు ఛిద్రమై యువకులు దుర్మరణం చెందడం స్థానికులను కలచివేసింది. కనీసం హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలతో బయటపడేవారని తెలుస్తోంది. లారీ ఢీకొనడంతో రోడ్డుపై ఎగిరి పడి తలకు తీవ్రగాయాలై మృత్యువాతపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ప్రముఖ డాక్టర్ దారుణ హత్య.. ఆ పెద్దాయనకు శత్రువులెవరు.?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.