యాప్నగరం

బైక్‌ని ఢీకొట్టిన సీఐ వాహనం.. స్పాట్‌లోనే ఇద్దరు.. వరంగల్‌లో విషాదం

బైక్‌పై వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దంపతులు అక్కడికక్కడే మరణించగా కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన తెలంగాణలో జరిగింది.

Samayam Telugu 25 Feb 2020, 7:42 pm
వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ని సీఐ వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాహనం పోలీసు అధికారిది కావడం గమనార్హం. తక్షణం స్పందించిన పోలీసులు తీవ్రగాయాలపాలైన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu warangal.


పాలకుర్తి సీఐ వాహనం ఢీకొని దంపతులు దుర్మరణం చెందారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నందనం కొండూరుకు కుటుంబంతో కలసి బైక్‌పై వెళ్తుండగా రాయపర్తి మండలం తిర్మలయపల్లి వద్ద పాలకుర్తి నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తున్న సీఐ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు స్పాట్‌లోనే చనిపోయారు. కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి.

Also Read: మరదలిపై కన్నేసిన అక్క భర్త.. ఫ్రెండ్‌తో కలసి బాలికపై దారుణం

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: గుడికెళ్లొస్తున్న బాలిక నోరుమూసి లాక్కెళ్లి.. రాత్రంతా నరకం.. ప్రూఫ్ అడిగిన పోలీస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.